ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై మహిళ ఉద్యోగులకు నైట్ షిఫ్టులు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై మహిళ ఉద్యోగులకు నైట్ షిఫ్టులు కూడా ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు అలాగే కార్మికులు రాత్రి 7 గంటల నుంచి 6 గంటల వరకు నైట్ షిఫ్ట్ చేసుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది.

Night shifts now available for female employees
Night shifts now available for female employees

ఇందు కోసం పరిశ్రమలలో భద్రత అలాగే సీసీ కెమెరాలు, రవాణా సహా ఇతర వసతులు మహిళలకు కల్పించాలని…. ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 9 గంటలు మాత్రమే పని చేసుకునేలా ఉన్న వెసులుబాటును ఇప్పుడు 10 గంటలకు పెంచినట్లు తాజాగా ఏపీ మంత్రి పార్థసారథి… కీలక ప్రకటన చేశారు. ఇక ఈ నిర్ణయంతో ఏపీలో ఉన్న మహిళలకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news