ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై మహిళ ఉద్యోగులకు నైట్ షిఫ్టులు కూడా ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు అలాగే కార్మికులు రాత్రి 7 గంటల నుంచి 6 గంటల వరకు నైట్ షిఫ్ట్ చేసుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది.

ఇందు కోసం పరిశ్రమలలో భద్రత అలాగే సీసీ కెమెరాలు, రవాణా సహా ఇతర వసతులు మహిళలకు కల్పించాలని…. ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 9 గంటలు మాత్రమే పని చేసుకునేలా ఉన్న వెసులుబాటును ఇప్పుడు 10 గంటలకు పెంచినట్లు తాజాగా ఏపీ మంత్రి పార్థసారథి… కీలక ప్రకటన చేశారు. ఇక ఈ నిర్ణయంతో ఏపీలో ఉన్న మహిళలకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.