కేటీఆర్ పొలిటికల్ కోచింగ్ సెంటర్ పోతే బెటర్..!

-

కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రాజకీయాలు మీకు..మాకు అవసరమే కానీ ఏం మాట్లాడాలో.. ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోయడం లేదు. కాబట్టి కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్ అని సలహా ఇచ్చారు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారు. మిలిటెంట్లు కాల్చి చంపింది నిజమే కదా ?.. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు తీసేస్తం అంటాడా అని కామెంట్స్ చేసారు జగ్గారెడ్డి.

ప్రజలు మాకు ఐదేళ్లు అధికారం ఇచ్చారు. రాజీవ్ గాంధీ .. 18 ఏండ్లు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారు. కేటీఆర్.. అమెరికా లో ఐటి ఉద్యోగం చేసిన అంటున్నావు.. ఆ ఐటినీ తెచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీ తో ఉద్యోగం తెచ్చుకుని ఆయన్నే తిడితే నిన్ను ఏమనాలి..? నువ్వు విగ్రహం తీసేస్త అంటే… మేము చూస్తూ ఊరుకుంటం అనుకుంటున్నావా? ఈ నాలుగేండ్లు రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకునే ధైర్యం.. దమ్ము నీకు లేదు. వచ్చే ఐదేళ్లలో కూడా నీకు ప్రజలు అవకాశం ఇవ్వరు..?మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..నీకు నో ఛాన్స్ అని పేర్కొన్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version