జై బాలయ్య, జై రేవంత్ రెడ్డి అన్నవారికే కాంగ్రెస్ లో పదవులు ?

-

రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. జై బాలయ్య, జై రేవంత్ రెడ్డి అన్నవారికే కాంగ్రెస్ లో పదవులు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. జై బాలయ్య, జై రేవంత్ రెడ్డి అన్నవారికే కాంగ్రెస్ ఎన్నారై సెల్‌లో పదవులు ఇస్తున్నారట. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎన్నారై కార్యకర్త స్రవంత్ పోరెడ్డి బయటపెట్టారు. కాంగ్రెస్ ఎన్నారై సెల్‌లో ఒరిజినల్ కాంగ్రెస్ వారు ఎవరూ లేరని.. జై బాలయ్య, జై రేవంత్ రెడ్డి అని భజన కొట్టే టీడీపీ వారికే పదవులు ఇచ్చారని కాంగ్రెస్ ఎన్నారై కార్యకర్త స్రవంత్ పోరెడ్డి ఆరోపించారు.


రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎన్నారై సెల్‌లో నా పేరు తీసేయండి అంటూ అయన వీడియో పోస్ట్ చేసారు. కాగా, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరుగుతున్న తానా సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దన్నారు. తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news