దర్శి ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా !

-

ప్రకాశం జిల్లా దర్శి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏయస్ దినేష్ కుమార్. ఈ సందర్భంగా కలెక్టర్ ఏయస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపడతామని ప్రకటించారు. ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందాలతో విచారణ చేస్తున్నామన్నారు.

ఇరుకుగా ఉన్న బ్రిడ్జిని దాటిన బస్సు ఓ కల్వర్టును ఢీకొట్టిన తర్వాత ఘటన జరిగిందని వివరించారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రలో ఉండటం మాత్రం కారణం కాకపోవచ్చన్నారు. ఎంత వేగంతో బస్సు వెళ్తుందనేది విచారణలో తేలుతుందని వెల్లడించారు. మృతదేహాల పోస్ట్ మార్టం కోసం ఆరుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రమాదానికి బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించారు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏయస్ దినేష్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news