తెలంగాణకు రాహుల్ గాంధీ…. మే 6న వరంగల్ లో బహిరంగ సభ

-

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు తీసుకువచ్చేలా రాహుల్ గాంధీ పర్యటన సాగనుంది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతోంది. మే 6న ఢిల్లీ నుంచి మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్నారు. ఆ తరువాత వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. మే 7న బోయిన్ పల్లిలో జరిగే సమావేశంలో పాల్గొనన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలతో, రైతుల కుటుంబాలతో సమావేశం కానున్నారు. ఆతరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో తెలంగాణపై నజర్ పెట్టింది. వరసగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు రాహుల్ గాంధీ. రెండు సార్లు తెలంగాణ నేతలతో భేటీ నిర్వహించారు. పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించారు. అసంత్రుప్తిగా ఉన్న జగ్గారెడ్డితో కూడా పర్సనల్ గా భేటీ అయ్యారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సమసిపోయాయని ఓ సంకేతం కార్యకర్తల్లోకి వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version