తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే

-

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కీలక హామీలు ప్రకటించింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఈ గ్యారెంటీలను కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మొదట మహాలక్ష్మి పథకాన్ని సోనియా గాంధీ ప్రకటించగా.. రైతుభరోసా పథకాన్ని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అనంతరం మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, యువవికాసం పథకం ప్రకటించారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నామని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే

1. మహాలక్ష్మి పథకం..

  • మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
  • పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

2. రైతు భరోసా..

  • ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు
  • వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు
  • వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌

3. ఇందిరమ్మ ఇళ్ల పథకం 

  • ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
  • తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం

4. గృహజ్యోతి పథకం 

  • గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

5. చేయూత పథకం

  • రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
  • చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌

6. యువ వికాసం

  • యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం.

Read more RELATED
Recommended to you

Latest news