ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం

-

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు అవుతుంది. స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్టభద్రత… మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటుంది. కౌంటింగ్‌ కోసం మొత్తం 1,798 టేబుల్స్‌ ఏర్పాటు, మొత్తం రౌండ్స్ 2417 ఉంటాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news