రైతులకు గుడ్ న్యూస్.. వచ్చేవారం పంట పరిహారం పంపిణీ

-

రైతులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు పంట పరిహారం పంపిణీకి అడుగు ముందుకు వేసింది.  పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించడంతో వచ్చే వారం రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. రైతులకు పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇవ్వనుంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మార్చిలో 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే  ప్రస్తుతం కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా పంపిణీ చేయలేకపోతున్నామని, ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే పంపిణీ చేస్తామని మంత్రులు చెప్పారు. ఈ మేరకు అనుమతి కోరుతూ ఈసీకి ప్రభుత్వం లేఖ రాయడంతో స్పందించిన ఈసీ పరిహారం పంపిణీకి అనుమతినిచ్చింది. అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15,812 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి రూ. 15.81 కోట్లు అవసరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news