విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందజేసింది. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ఎస్బిఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ధైర్యం, నమ్మకం మరింతగా పెరుగుతుందని మంత్రి వెల్లడించారు.

విద్యుత్ శాఖలో పనిచేయడానికి చాలామంది భయపడుతున్నారు. వారికి ఈ బీమా పథకం ప్రవేశపెట్టడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు విద్యుత్ శాఖ చాలా పెద్దదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు విద్యుత్ శాఖ చాలా అవసరమని వెల్లడించారు. ఈ బీమా పథకం తొందరలోనే ప్రారంభం కానుంది.