BREAKING: తెలంగాణలో విషాదం.. డి.శ్రీనివాస్ కన్నుమూత

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విశాలను చోటు చేసుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్… ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇవాళ ఉదయం 3 గంటలకు గుండెపోటు రావటంతో… మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు.

ఈ విషయాన్ని… ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా డి శ్రీనివాస్… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి చీఫ్ గా, మొన్నటి వరకు గులాబీ పార్టీలో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఇక ధర్మపురి శ్రీనివాస్ చిన్న కొడుకు… ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా మన గెలిచిన సంగతి తెలిసిందే. ధర్మపురి శ్రీనివాస్ పెద్దకొడుకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక డి శ్రీనివాస్ మృతి పట్ల… పలుగురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news