నన్ను పండబెట్టి తొక్కుతావా.. రా ఎడికొచ్చి తొక్కుతావో నేను చూస్తా – డీకే అరుణ

-

నన్ను పండబెట్టి తొక్కుతావా.. రా ఎడికొచ్చి తొక్కుతావో నేను చూస్తా అంటూ డీకే అరుణ సవాల్‌ విసిరారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కుకుంటూ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్దిని పంపిస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన డీకే అరుణ…నన్ను పండబెట్టి తొక్కి పార్లమెంట్ సీట్ గెలిపిస్తావా.. రా ఎడికొచ్చి తొక్కుతావో నేను చూస్తానంటూ సవాల్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన ఈ మాటలకు ప్రతి మహిళ బుద్ధి చెప్పాలని కోరారు డీకే అరుణ.

dk aruna slams cm revanth

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది….అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరులోనే రాజకీయం చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల కోడ్ వచ్చాక అయిదు సార్లు వచ్చారు…మొన్న మా నామినేషన్ ర్యాలీ చూసి కాంగ్రెస్ భయపడి పోయిందన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు…ఒక్క అరుణమ్మ ను ఎదుర్కొనేందుకు గుంపులుగా వస్తున్నారని చురకలు అంటించారు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Latest news