Telangana: కరెంట్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి.. 4 గంటలు స్తంభం మీదే మృతదేహం

-

కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలు ప్రాణాలు కోల్పోయాడు ఎలక్ట్రీషియన్. అంతేకాదు.. 4 గంటలు స్తంభం మీదే ఎలక్ట్రీషియన్ మృతదేహం ఉంది. ఈ దారుణమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్‌ చోటు చేసుకుంది.

Electrician dies of electric shock

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడం కోసం మోతిరాం (38) అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ స్తంభం ఎక్కగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు.

విద్యుత్ శాఖ నిర్యక్ష్యంతోనే మోతిరాం చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన చేయగా, మృతదేహం 4 గంటల పాటు అక్కడే ఉంది. మోతిరాం మాకు చెప్పకుండా పోల్ ఎక్కాడని చివరకు రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news