37 మందికి మంత్రులుగా తిరిగి దక్కని చోటు

-

గత కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం కేబినెట్లో చోటుదక్కలేదు. వారిలో ఏడుగురు క్యాబినెట్‌ ర్యాంకు మంత్రులు ఉండగా.. మిగిలిన 30 మంది సహాయమంత్రులు. స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకుర్, నారాయణ్‌ రాణె, పరుషోత్తం రూపాలా, అర్జున్‌ ముండా, ఆర్‌.కె.సింగ్, మహేంద్రనాథ్‌ పాండే మోదీ 2.0 సర్కారులో క్యాబినెట్‌ ర్యాంకు మంత్రులుగా ఉన్నారు. వారికి మోదీ 3.0 మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ప్రస్తుతం మంత్రి పదవిని కోల్పోయినవారిలో 18 మంది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైనవారే.

మోదీ 2.0 సర్కారులో సహాయమంత్రులుగా పనిచేసి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కనివారు.. వి.కె.సింగ్, ఫగ్గణ్‌సింగ్‌ కులస్తే, అశ్వినీ చౌబే, దన్వే రావ్‌సాహెబ్‌ దాదారావ్, సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, సంజీవ్‌ బల్యాన్, రాజీవ్‌ చంద్రశేఖర్, సుభాష్‌ సర్కార్, నిశిత్‌ ప్రమాణిక్, రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్, ప్రతిమా భౌమిక్, మీనాక్షి లేఖి, ముంజపరా మహేంద్రభాయ్, అజయ్‌ కుమార్‌ మిశ్ర, కైలాశ్‌ చౌధరీ, కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్,  భారతీ ప్రవీణ్‌ పవార్, కౌశల్‌ కిశోర్, భగవంత్‌ ఖుభా, వి.మురళీధరన్, భాను ప్రతాప్‌సింగ్‌ వర్మ , జాన్‌ బార్లా, బిశ్వేశ్వర్‌ టుడు, భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్, దేవుసిన్హ్‌ చౌహాన్, అజయ్‌ భట్, ఎ.నారాయణ స్వామి, సోమ్‌ ప్రకాశ్, రామేశ్వర్‌ తేలి, దర్శనా విక్రమ్‌ జర్దోశ్‌.

Read more RELATED
Recommended to you

Latest news