దందాలు చేసేవారే పార్టీని వీడుతున్నారు: ఎర్రబెల్లి దయాకర్‌రావు

-

ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే తమ పార్టీని వీడుతున్నారని అన్నారు. రాజకీయ జీవితంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశానని, దివంగత నేత వైఎస్సార్‌ ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా తాను పార్టీ మారలేదని ఎర్రబెల్లి తెలిపారు. ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలోనే తామంతా కొనసాగుతామని తేల్చి చెప్పారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు తనకు బంధువని మీడియా అడిగిన ప్రశ్నకు దయాకర్‌రావు స్పందిస్తూ ప్రణీత్‌రావు అమ్మమ్మ స్వగ్రామం పర్వతగిరి అని మాత్రమే తెలుసునని, అంతకు మించి ఆయన ఎవరో తనకు తెలియదని అన్నారు. మరోవైపు ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని, మాయ మాటలు చెప్పి మోసాలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని విమర్శించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news