చంద్రబాబు బయటకు వచ్చాక కాంగ్రెస్ ను లేపే ప్రయత్నం జరుగుతుంది : ఈటల

-

చంద్రబాబు బయటకు వచ్చాక కాంగ్రెస్ ను లేపే ప్రయత్నం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ పార్టీ నేత ఈటల రాజేందర్. బీజేపీలో చేరారు మునుగోడు నేత చలమల్ల కృష్ణారెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించిన కృష్ణారెడ్డి…నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

etala comments on chandrababu

ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు చలమల్ల కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నాడు అంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు ఈటల రాజేందర్. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news