యాసంగికి కూడా రైతు భరోసా లేనట్టే..తుమ్మల ప్రకటన !

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు మరో షాక్‌ తగిలిలంది. యాసంగికి కూడా రైతు భరోసా లేనట్టేనని సమాచారం అందుతోంది. యాసంగికి కూడా రైతు భరోసా లేనట్టే అంటూ పరోక్షంగా తేల్చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గాంధీ భవన్ లో రైతు భరోసా పై ముఖాముఖి కార్యక్రమంలో బాంబు పేల్చారు తుమ్మల. రుణమాఫీ పూర్తి అయ్యేవరకు రైతు భరోసా లేదని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు.


అంటే.. ఈ యాసంగికి రైతు భరోసా అందకపోవచ్చన్న మాట. దీంతో అయోమయంలో రైతులు ఉన్నారు. అటు రుణమాఫీ ఎప్పుడు అవుతుందో కూడా స్పష్టత ఇవ్వడం లేదు కాంగ్రెస్‌ ప్రభుత్వం. రుణమాఫీ పూర్తి అయ్యేవరకు రైతు భరోసా లేదంటూ ప్రకటనతో ఆందోళన లో రైతన్నలు ఉన్నారు. ఇక అటు గాంధీభవన్ కి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… ఇకపై సోమవారం గాంధీభవన్ కి మంత్రులు వస్తారని తెలిపారు. వారంలో రెండు రోజులు గాంధీభవన్ కి మంత్రులు రావాలని పిసిసి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version