నవంబర్ లో SLBC టన్నెల్ తవ్వకాలు ప్రారంభిస్తాం : మంత్రి కోమటిరెడ్డి

-

నవంబర్, డిసెంబర్ లో SLBC టన్నెల్ తవ్వకాలు ప్రారంభిస్తామని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే SLBC ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు. కుర్చీ వేసుకొని ఇక్కడ కూర్చొని ప్రాజెక్ట్ ని పూర్తి చేయిస్తానన్న కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్పకుండా SLBC ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపారు. రూ.2వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తే.. పూర్తి అయ్యేదని తెలిపారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ తో అంతగా ఉపయోగం లేదన్నారు. SLBC ప్రాజెక్ట్ తో నాలుగున్నర  లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.దుర్మార్గుడు కేసీఆర్ SLBC  టన్నెల్ పనులు పెండింగ్ లో పెడితే.. దేవుడు కేసీఆర్ ని ఫాం హౌస్ లో పడుకోబెట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version