BRS మేనిఫెస్టో.. రూ.500కే సిలిండర్?

-

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్గడ్ లో అతి త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య CEC షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నవంబర్ నుంచి డిసెంబర్ తొలి వారంలో పోలింగ్, అదే నెల 10-15 మధ్య ఫలితాలు వెలువరించినట్లు సమాచారం. కాగా, TS, MP, రాజస్థాన్, మిజోరాం లలో ఒకే విడతలో, ఛత్తీస్గఢ్ లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

 

అయితే.. ఈ తరుణంలోనే.. మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. మహిళలు, యువత, రైతులే ఏజెండాగా మేనిఫెస్టో ఉండ బోతున్నట్లు సమాచారం. సిలిండర్ ధర రూ.450-500కే ఇవ్వడంతో పాటు యువత ఉద్యోగాలకు ఉచితంగా ప్రిపేర్ అయ్యేలా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందనే అంశాలను ఇందులో చేర్చినట్లు తెలు స్తోంది. రైతులకు పింఛన్లు, ఉచిత ఎరువుల హామీలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధం అయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news