నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుభరోసా విజయోత్సవ సభలు నిర్వహిచనున్నారు. సచివాలయం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతుభరోసా విజయోత్సవం ఉంటుంది. ఇక ఈ తరుణంలోనే ఇవాళ సాయంత్రం 6 గంటలకు రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇక అటు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కేబినెట్ భేటీ కావడం గమనార్హం.
ఈ సందర్బంగా స్పోర్ట్స్ పాలసీని ఆమోదించిన తెలంగాణ కేబినెట్… కాళేశ్వరం కమిషన్కు మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ కీలక తీసుకుంది. రెవెన్యూ సదస్సులో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ చేప ట్టి క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది కేబినెట్.