Sugavasi Subramanyam: అన్నమయ్య జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. అన్నమయ్య జిల్లాలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం…. వైసీపీ పార్టీ లో చేరుతున్నారు. ఈ మేరకు సుగవాసి బాలసుబ్రమణ్యం కీలక ప్రకటన చేశారు. ఈ బుధవారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నానన్నారు.

ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు పదేళ్ల నుంచి నా తండ్రి పశ్చాత్తాపం, ఆవేదనలో నుంచి పుట్టిన మనోభావాలకు ప్రతిరూపమే ఈ నిర్ణయం అని చెప్పారు సుగవాసి సుబ్రమణ్యం. అటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు పార్టీ కాదు కార్యకర్తలే ముఖ్యమన్నారు బాలసుబ్రమణ్యం సోదరుడు ప్రసాద్ బాబు. కాగా సుగవాసి బాలసుబ్రమణ్యం ఫ్యామిలీ జూన్ 7న #TDP కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.