TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ కేసు.. తండ్రీకుమారుడికి బెయిల్‌ మంజూరు

-

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు వందకు పైగా మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులకు బెయిల్​ లభించింది. మైబయ్య, జనార్దన్​లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు బెయిల్​ పొందిన వారి సంఖ్య 17కు చేరింది.

ఇక మైబయ్య.. తమ కుమారుడు జనార్దన్​ కోసం ఢాక్యా నాయక్​ నుంచి రూ.2 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల విచారణలో తేలడంతో ఏప్రిల్ 21న మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్​ను పోలీసులు అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు.. ఈ కేసులో ప్రమేయమున్న 37 మంది నిందితులను డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ 37 మంది నిందితులు ఇకపై కమిషన్ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్​పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నిందితులకు నోటీసులు జారీ చేసింది. లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేయనున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news