Telangana: గన్ పార్క్ చుట్టూ కంచెలు పెట్టించిన రేవంత్ సర్కార్!

-

మరో దుశ్చర్యకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌…పాల్పడినట్లు బీఆర్‌ఎస్‌ ఫైర్‌ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ చుట్టూ కంచెలు బిగిస్తోందంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు.

Fences around the gun park on the occasion of Telangana statehood day

ఇక అటు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు నమోదు చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. గురు వారం చార్మినార్ దగ్గర నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. అధికార చిహ్నంలో చార్మినార్ తొలగింపుపై గురు వారం చార్మినార్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాథ్ మరియు ఇతర నాయకుల పై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు చార్మినార్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news