తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

-

తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎస్ – 2 భోగి లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాసింజర్స్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రైన్ ను నాగపూర్ సమీపంలోనే ఆపివేసింది.

ఇక మంటలు ఇతర బోగీలకు నెమ్మదిగా వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు భోగిలోని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనాష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version