నాంపల్లి అగ్ని ప్రమాద మృతుల కుటంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నాంపల్లి అగ్ని ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఒక్క మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు.

For the families of Nampally fire victims, Rs. 5 lakh financial assistance

హైదరాబాద్‌ నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఈ సందర్భంగా నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.  నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేస్తామని కూడా, నిందితులను వదిలిపెట్టబోమని వివరించారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news