మాజీ ఎంపీ నందిగం సురేష్ కి అస్వస్థత

-

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వైసీపీ నుంచి 2019లో బాపట్ల ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలో టీడీపీ అధికారంలో లేదు. అప్పుడు మంగళగిరి టీడీపీ కార్యాలయం దాడి కేసులో జైలుకు వెళ్లారు. ఇటీవలే ఆయనకు బెయిల్ వచ్చింది. మరో కేసులో ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జైలు లో ఉన్నారు. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతి, భుజం నొప్పి రావడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.  అరెస్టు సమయంలో సురేష్ తన భుజం నొప్పిగా ఉందని జైలు అధికారులకు చెప్పాడు. చంద్రబాబు ఇంటి పై దాడితో పాటు మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ప్రస్తుతం నిందితుడుగా ఉన్నాడు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలు కు తరలించారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news