నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి మొదలుకానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలు మొదలవుతాయి.

శాసనసభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా మండలి సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు, సభను ఎన్ని రోజులు నడపాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version