కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి?

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఆ పార్టీలో చేరికలు ఉద్ధృతమయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హస్తం తీర్థం పుచ్చుకుంటున్న నేతలు ఎక్కువయ్యారు. సాధారణ నాయకులే కాకుండా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో ఎమ్మెల్యే చేరనున్నట్లు తెలిసింది.

బీఆర్ఎస్ కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందని, వారం రోజుల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ను వీడతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని సంప్రదించగా… ‘‘పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కార్యకర్తల అభిప్రాయం తీసుకుని చేరికపై నిర్ణయం తీసుకుంటా’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే బండి సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన చేరికతో రాష్ట్ర కాంగ్రెస్లో చిన్న ఉలికిపాటు ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version