ఛార్మినార్ వద్ద వినాయకుడి లడ్డు మిస్.. సీసీ పుటేజీలో వెలుగులోకి..!

-

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మండపాల్లో కొలువైన వినాయకుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి అంత ప్రాధాన్యత ఇస్తారు. వినాయకుడితో పాటు ఆయన చేతిలో పెట్టిన లడ్డూను కూడా నవరాత్రుల్లో పూజిస్తారు. ఆ లడ్డూను కూడా నవరాత్రుల చివరి రోజున వేలం వేస్తారు. లడ్డూలు పొందిన వారిని భక్తులు అదృష్టవంతులుగా భావిస్తారు. 

లడ్డూలు పొందిన  కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతుంటారు భక్తులు. వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూని కొందరూ విద్యార్థులు దొంగిలించడం కలకలం రేపుతుంది. చార్మినార్ లోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో చోటు చేసుకుంది. గణేష్ లడ్డూ చోరీకి గురైంది. పాఠశాల విద్యార్థులు దాదాపు 21 కిలోల లడ్డూలు మోసుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో కొందరూ పాఠశాల విద్యార్థులు 21 కిలోల లడ్డులను ఎత్తారు. ఈ విషయం పై గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపం సమీపంలోని సీసీటీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల నుంచి వెళ్తున్న విద్యార్థులుగా గణేష్ మండపం వద్ద వెళ్తూ కనిపించారు. తరువాత ఆ ఇద్దరూ విద్యార్థులకు ఎదురుగా మరో విద్యార్థి వచ్చాడు. ఆ తరువాత ఇంో విద్యార్థి సైకిల్ వేసుకొని వచ్చాడు.

 

విద్యార్థులందరూ ఒకరొనొక మండపంలో ఎవ్వరూ లేరని మాట్లాడుకున్నారు. గణేష్ మండపంలో ఒక్కొక్కరూ సైలెంట్ గా లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లే వారు కూడా పిల్లలను పట్టించుకోలేదు. దేవుడికి దండం పెట్టేందుకు లోపలికి వెళ్తున్నట్టు ఆలోచించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. మండపంలోకి వెళ్లిన విద్యార్థులు వినాయకుడి చేతిలో ఉన్న 21 కిలోల లడ్డూను తీసుకొని తిన్నారు. ఏం తెలియనట్టు బయటికి వచ్చేశారు. ఒకరినొకరు చేయి చేయి కలుపుకొని నవ్వుకుంటూ మెల్లగా జారుకున్నారు. ఇవన్నీ సీసీ కెమెరాలో చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. దొంగతనం చేసిన వారందరూ మైనర్లే కావడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news