Motkupalli Narasimhulu : చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతోంది

-

చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసనకు దిగారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ ఎల్లకాలం సీఎంగా ఉండరు.

Motkupalli Narasimhulu
Motkupalli Narasimhulu

ఏ ఆధారంతో చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబుకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి’ అని మోత్కుపల్లి వాక్యానించారు. చంద్రబాబును చంపే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వాక్యాలు చేశారు. ‘చంద్రబాబు చనిపోతే తనకు ఎదురు ఉండదని జగన్ భావిస్తున్నారు. ఎవరిని ఎలా చంపాలి, ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన. త్వరలోనే భువనేశ్వరిని కలిసి మాట్లాడతా. జగన్ కు భువనేశ్వరి ఉసురు కచ్చితంగా తగులుతుంది. నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకెళ్లడం ఖాయం’ అని వాక్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news