3.10 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన GHMC..!

-

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం GHMC ప్ర‌ధాన కార్యాల‌యంలో GHMC ఉద్యోగులు, సిబ్బందికి మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను మేయ‌ర్ పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను చైత‌న్య పర్చడంలో భాగంగా GHMC ద్వారా మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్స‌రం జిహెచ్ఎంసి ద్వారా 3.10 లక్షల మ‌ట్టి వినాయక విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. అందులో 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ పంకజ, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news