పండుగ వేళ విషాదం.. చనిపోయే ముందు సోదరులకు రాఖీ కట్టిన యువతి

-

వేధింపులు తాళలకే గడ్డిమందు తాగిన ఓ విద్యార్థిని తెల్లారితే తాను బతుకుతానో లేదోనని.. రాఖీ పండుగకు తాను లేకపోతే తన సోదరుడికి ఎవరు రాఖీ కడతారని కొన ఊపిరితో తమ్ముడికి రాఖీ కట్టి కన్నుమూసింది. రక్షా బంధన్ వేళ మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (17) కోదాడలో పాలిటెక్నిక్‌ ఫస్ట్ ఇయర్ చదవుతోంది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ఆకతాయి ప్రేమ పేరిట తరచూ వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె గత గురువారం గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా .. సోమవారం రక్షాబంధన్‌ వరకు తాను ఉంటానో లేదోనంటూ.. ఆమె శనివారం రాత్రి తన తమ్ముడితోపాటు పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మరణించింది.

Read more RELATED
Recommended to you

Latest news