రెండు రోజులు సమయమివ్వండి.. రాజ్ పాకాల రిక్వెస్ట్..!

-

జన్వాడ ఫామ్ హౌస్ కేసు లో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్ పాకాల పోలీసుల నోటీసుల పై స్పందించారు. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని పోలీసులకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన తన లాయర్ల ద్వారా తన లేఖను పోలీసులకు పంపించారు. మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే సమాచారంతో హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ కేసు లో విజయ్ మద్దూరి పోలీసులకు సహకరించడం లేదని సమాచారం. రెయిడ్ సమయంలో విజయ్ తన మొబైల్ దాచాడంటున్న పోలీసులు. తన భార్య మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరూ పోలీసుల ముందు నోరు విప్పితేనే ఈ కేసు ముందుకు సాగనుందని పోలీసులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news