తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..వారందరికీ యూనిఫామ్‌ లు

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వచ్చే విద్య సంవత్సరంలో పాఠశాలలు తెరిచేనాటికే విద్యార్థులందరికీ యూనిఫామ్ లు అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏకరూప దుస్తుల పంపిణీ, మన ఊరు-మనబడి కార్యక్రమంపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 121 కోట్లతో ఏకరూప దుస్తులను రూపొందించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news