తెలంగాణలోని ప్రజలకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో రెండు లక్షల రేషన్ కార్డులు జారీ చేసింది. రెండు లక్షల రేషన్ కార్డులు పెరగడంతో తెలంగాణలో మొత్తం 91.83 లక్షలకు రేషన్ కార్డులు పెరిగాయి. లబ్ధిదారులు 3.5 కోట్లకు పెరిగారు. దరఖాస్తులను వెరిఫై చేసిన తర్వాత రెండు లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు అనుమతించారు మిగిలిన దరఖాస్తులు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

కొత్తగా అప్లై చేసుకున్న అర్హులకు రేషన్ కార్డు లభిస్తుందని అధికారులు వెల్లడించారు. కొత్తగా వివాహమైన వారు కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. గత రెండు నెలల నుంచి రేషన్ దుకాణా దారులు సన్నబియ్యాన్ని అందిస్తున్నారు. ఈ నెలలోనే ఒకేసారి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం తీసుకునే అవకాశాన్ని ప్రజలకు అందించారు. ఈరోజు నుంచి రేషన్ షాపులలో బియ్యం ఇవ్వనున్నారు. బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీంతో తెలంగాణలోని ప్రజలు సంతోషంలో ఉన్నారు.