భారత దేశ వ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే భారత దేశ వ్యాప్తంగా 685 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దింతో భారత దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,395 కు చేరాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్ తో 26 మంది మృతి చెందారు.

కాగా ఏలూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తున్న నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నమోదు ఐంది. దింతో హోం ఐసొలేషన్ లో నలుగురు ఉన్నారు. కలెక్టరేట్ లో పనిచేసే అందరికీ కరోనా పరీక్షలు చేశారు వైద్యులు. 4 రోజుల క్రితం శాంతినగర్ లో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ సోకింది. దింతో ఏలూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది.