తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. నెల రోజుల్లో హెల్త్ కార్డులు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్  గుడ్ న్యూస్ చెప్పింది. మరో నెల రోజుల్లో హెల్త్ కార్డులు అందజేయనున్నట్టు సీఎం  రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్యానగర్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనెవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

నెల రోజుల్లోనే ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. సామాన్య ప్రజలు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జవహర్ లాల్ నెహ్రు ముందు చూపు వల్లనే దేశంలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన చాలా తక్కువ అని.. క్యాన్సర్ వ్యాధికి వైద్య సదుపాయాలు మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు కూడా క్యాన్సర్ చికిత్స లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news