విద్యారంగం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది : మంత్రి పొన్నం

-

విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నల్లగుట్ట, బాలంరాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆయన సందర్శించారు. ఎఫ్ఎలెన్, ఏఎక్సెల్, ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లను ఆయన పరిశీలించారు. అనంతరం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ద్వారా
విద్యార్థుల పర్ఫామెన్స్ ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version