అప్పు కోసం పసికందును అమ్మిన అమ్మమ్మ..!

-

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మోతే పద్మ, రమేష్‌ల కూతురును ఆమె అమ్మమ్మ కనకమ్మ అమ్మకానికి పెట్టింది. పెద్దపల్లి జిల్లాలో నివాసముండే ఓ కుటుంబానికి ఆ పసికందును లక్షా 10 వేలకు అమ్మేసింది. నెల రోజుల క్రితం జన్మించిన శిశువును అమ్మితే వచ్చిన డబ్బులతో ఆమె అప్పులను తీర్చేసుకున్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తన కూతురికి చెప్పింది కనకమ్మ. అయితే కూతురుకి  పుట్టిన బిడ్డను అమ్ముకున్నారని తెలియడంతో పద్మ తండ్రి యాదగిరి డయల్‌ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Baby
 

దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కనకమ్మను, ఆమెకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇకపోతే పద్మ, రమేష్‌ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా.. పద్మ- రమేష్‌ ల మధ్య గొడవలు తలెత్తడంతో పద్మ తన పుట్టింటికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news