Group-2 Exam : గ్రూప్-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా..!

-

Group-2 Exam : గ్రూప్-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా వేయనుంది టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-2 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గౌరవ సీఎం కేసీఆర్ ఆదేశించారని పోస్ట్‌ పెట్టారు మంత్రి కేటీఆర్‌.

భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు సరిగ్గా ఉండేలా చూడాలని చీఫ్ సెక్రటరీకి కేసీఆర్ సూచించారన్నారు. ప్రతి ఔత్సాహికుడికి అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం ఉండేలా చూడాలని సీఎస్ కి కేసీఆర్ సూచనలు చేసినట్లు పేర్కొన్నారు కేటీఆర్‌. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రూప్-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా వేయనుంది టీఎస్‌పీఎస్సీ.

Read more RELATED
Recommended to you

Latest news