బిజెపిని ఓడించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు – గుత్తా సుఖేందర్ రెడ్డి

-

బిజెపిని ఓడించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని చురకలు అంటించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇవాళ మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, కర్ణాటక ఫలితాల తర్వాత దేశంలో, రాష్ట్రంలో అధికారం లేని కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తోందన్నారు. దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే కారణం అని మండిపడ్డారు.

సిఎం కెసిఆర్ ను గద్దె దింపాలనే దురాలోచనతోనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని అగ్రహించారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే విజయవంతంగా అమలు అయినట్లు చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తాం అని చెప్తున్న సంక్షేమ పథకాలు… కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మేము సమైఖ్యoగా ఉన్నామని చెబుతూనే క్రమశిక్షణ లేకుండా 1400 కిమీ పాదయాత్ర చేసిన భట్టిని ఖమ్మం సభలో పక్కకు నెట్టారు… బీజేపీని గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని అగ్రహించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version