కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుర్తు పెట్టుకోండి.. కాళ్లు మొక్కినా కనికరించం బిడ్డ! అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. BRSలో ఆణిముత్యాలుంటే.. దోచుకున్న దొంగలు కాంగ్రెస్లో చేరిండ్రు అని మండిపడ్డారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం…. అప్పుడు ఒక్కొక్కరిని దొరకబట్టి.. దోచుకున్నది కక్కిపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

కాగా సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి’ అనే అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని, పేరెంట్స్ను ఇబ్బంది పెట్టొద్దని.. చక్కగా చదువుకోవాలని కోరారు. డిసిప్లిన్ ముఖ్యమని ఈ విషయాన్ని ఎన్నడూ మరువద్దన్నారు.టీచర్లను గౌరవించాలని కోరారు. ఈ విషయంపై తనకు ప్రామిస్ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు.