కాంగ్రెస్ గెలిచేది లేదు… డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు – హరీష్ రావు

-

కాంగ్రెస్ గెలిచేది లేదు… డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారని ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్ రావు. సొంత గూటికి చేరుకున్నారు రామ్మోహన్ గౌడ్. ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ… రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు.

ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి అన్నారు. రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోతారు. 11 మంది కార్పొరేటర్లు గెలిపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారని వివరించారు. రామ్మోహన్ గౌడ్ కు బిఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి. పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేను బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందాం. కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు. అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news