ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యే సబితమ్మకు ఇచ్చే గౌరవం ఇదేనా? – హరీష్‌ రావు ఫైర్

-

ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యే సబితమ్మకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ హరీష్‌ రావు ఫైర్ అయ్యారు. ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఉల్లంఘనల పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా? అని నిలదీశారు.

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని విస్మరించి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ గారు వెంటనే స్పందించాలి. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news