సిద్దిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న హరీష్ రావు

-

ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా భరత్ నగర్ లోని అంబీటస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి హరీష్ రావు. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌ లో పాల్గొనాలని.. అందరూ ఓటేసి… పోలింగ్‌ శాతం పెంచాలని కోరారు మంత్రి హరీష్‌ రావు.

Harish Rao who exercised his right to vote in Siddipet

ఇక అటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని తెలిపారు. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే ఓటు వేశానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version