ఆంధ్ర వాళ్లను అనలేదు.. గాంధీనే అన్నాడు – కౌశిక్ క్లారిటీ

-

ఆంధ్రసెటిలర్స్ అంటే నాకు ఎంతో గౌరవం.. ఆంధ్రావాళ్లను నేను అనలేదు.   కావాలనే ఆంధ్రా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. 40 మంది గూండాలను సైబరాబాద్ పోలీసులు ఆపలేకపోయారా..? నేను చేసిన తప్పేంటి..? కౌశిక్ రెడ్డి చావడానికి అయినా సిద్దంగా ఉన్నాడు.. మీతో కాంప్రమైజ్ కావడానికి లేడు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.

ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా అరికెపూడి గాంధీ ప్రవర్తన ఉందన్నారు. నా మాటలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కేవలం అరికెపూడి గాంధీని మాత్రమే అన్నాను. హైదరాబాద్ ప్రజలు కుట్రలు గమనించాలి. గాంధీ మాట్లాడేది భాషేనా..? మా విల్లా లోకి వచ్చి భయబ్రాంతులకు గురి చేశారు. గాంధీ మొకం చూసి ఓటేయలేదు. కేసీఆర్ మొకం చూసి ఓటేశారు. గాంధీ మా ఇంటికి వచ్చి నా వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలికి పగిలి పోయే.. కిటికీ అద్దాలు పగల గొట్టావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version