ఈడీ కేసుపై స్టే ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

-

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈడీ అధికారుల దర్యాప్తును వ్యతిరేకిస్తే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసు పై స్టే ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

రోహిత్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి పార్టీ మారాలని 100 కోట్లు ఆఫర్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఆఫర్ మాత్రమే ఇచ్చారని కానీ డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే నగదు లావాదేవీలు జరగలేదు కనుక ఈడికి విచారణ పరిధి లేదని వాదించారు. రోహిత్ రెడ్డిని విచారణకు ఎప్పుడు పిలిచారని ఈడీ కోర్టు ప్రశ్నించగా.. ఈనెల 30న విచారణకు హాజరవ్వాలని తెలిపామని ఈడి వివరించింది. అనంతరం ఈ కేసుని జనవరి 5 కు వాయిదా వేసింది హైకోర్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version