కాళేశ్వరం, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై పోరుకు బీఆర్ఎస్ రెడీ అయింది. రైతుల పక్షాన మరో పోరాటానికి గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది.

కాళేశ్వరంపై నిర్లక్ష్యం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల తో పాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యంపై ప్రధానంగా చర్చ ఉండనుంది.