తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాబోయే ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కుడుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో వానలు విపరీతంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో మన్యం, అల్లూరి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దని సూచనలు చేస్తున్నారు.