అయ్యో పాపం.. భార్యను బెదిరించాలనుకుని నిజంగానే ఉరేసుకున్నాడు

-

కొన్ని సార్లు మనం చేసే పనులు, మాట్లాడే మాటలు మనకే హాని కలగజేస్తాయి. అలా ఓ వ్యక్తి భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  శ్రీకాకుళం జిల్లాకు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు సింహాద్రి నాగరాజు (36), మొదటి భార్యతో విడాకులు తీసుకుని బాలాజీనగర్‌ చంద్రపురికాలనీకి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. నాగరాజు మద్యానికి బానిసై తరచూ ఆమెను వేధిస్తున్నాడు. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని తరచూ భార్యను బెదిరించేవాడు.

ఈనెల 6వ తేదీన కూడా మద్యం తాగి ఇంటికి రాగా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య పిల్లలతో దమ్మాయిగూడలోని అమ్మమ్మ వద్దకు వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికొచ్చేసరికి తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా భర్త ఉరివేసుకున్నట్లు గుర్తించింది. తనను భయపెట్టే క్రమంలోనే చనిపోయిన ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news