హైదరాబాద్‌ లో విషాదం..బాత్రూంలో కరెంటు షాక్ కొట్టి ముగ్గురు మృతి

-

Hyderabad 3 of Family Electrocuted in Bathroom: హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. బాత్రూంలో కరెంటు షాక్ కొట్టి ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం రోజున రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad 3 of Family Electrocuted in Bathroom

హైదరాబాద్ నగరం సనత్ నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సి అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో గల 204 ఫ్లాట్లో విద్యుదాఘాతంతో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతి చెందారు. ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను గుర్తించారు కాలనీవాసులు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. వారు ఆత్మహత్య చేసుకున్నారా.. లేక.. కరెంట్‌ షాక్‌ తో మరణించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news